కరోనా
- 19 ఒక సూచిక
ప్రపంచంలో
ఏమి జరుగుతోంది: గత మూడు నెలల్లో, దేశాల తరువాత దేశాలు కరోనా తరంగంలో మునిగిపోతున్నాయి - చైనా, యుఎస్ఎ, ఇటలీ, ఇరాన్
మరియు ఇలా మరెన్నో దేశాలలో ఎవరిని
రక్షించాలో మరియు ఎవరు చనిపోవాలో వైద్యులు నిర్ణయించే వరకు, సామూహికంగా ప్రజలను సమాధులు
చేయవలసిన పరిస్థితి వచ్చేంత వరకు ఆఖరికి ఆరోగ్య మంత్రులు మరియు అధ్యక్షులు
అనారోగ్యానికి గురికావడం మొదలుపెట్టే వరకు కుడా ప్రతిచోటా రాజకీయ నాయకత్వం చేష్టలుడికినట్లు
ఉండిపోతున్నాయి. రోమ్ నగరం వంటి అతి రద్దీగా ఉండే వీధుల్లో ఒక్క
వ్యక్తిని కూడా ఈ వ్యాధి వదిలిపెట్టలేదు. చైనా, ఇటలీ, కొరియా యొక్క తప్పులు మరియు విజయాల
నుండి మనం చాలా నేర్చుకోవాలి.
ఇలాంటి సమయంలో నాయకులు ప్రశాంతంగా
ఉండి బలాన్ని చూపించాలి దేశాలు / రాష్ట్రాలు కలిసి ఉండి పనిచేయాలి అందుకు ప్రజలు సహకరించాలి
మనతో పాటు మన చుట్టూ వున్న వారిని మేల్కొలపాలి. మన ఉద్యోగులతో సామజిక మాధ్యమాల ద్వారా
మాట్లాడాలి వారికి అవగాహన కల్పించాలి, అజ్ఞానంతో
కూడిన ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడినా వారి ప్రతిస్పందన ద్వారా మన మార్గనిర్దేశకం పాడుకాకూడదు.
మనకు ఇప్పటికీ కరోనా గురించి మనకు చాలా తక్కువ పరిజ్ఞానం వుంది, కరోనా వ్యాధి మనిషిలోకి ప్రవేశించి వ్యాప్తి చెందేది
రెండు వారాలు, ఇప్పుడు ఆ రెండు వారాలే జీవితకాలం, అందువలన మనం చాలా వేగంగా నేర్చుకోవాలి,
మనకు ఒకే ఒక అవకాశం ఉంది.
భ్రమపడకండి: భారతదేశం బహుశా కరోనా సంక్రమణ వ్యాధి యొక్క
తీవ్రతను చూడదని, లేదా
మేము చేతులు కడగడం ద్వారా బయటపడగలమని మనవారు అంటున్నారు. మంచిది, ఇక్కడ నాకు చిన్ననాటి కథను గుర్తు
చేస్తుంది, “పావురం
పిల్లిని చూసినప్పుడు, అది
కళ్ళు మూసుకుంటుంది. ఆ విధంగా, పావురం పిల్లిని చూడలేనందున, పిల్లి అక్కడ లేదని అది ఊహిస్తుంది". భారతదేశం
నగరాలలోని ప్రజలు చైనా, ఇటలీ, ఇప్పటికే వారి అలవాట్లవలన వ్యాధుల బారిన పడేవారుగా
వున్నారని అందుకే వారు కరోనా వచ్చి కష్టపడుతున్నారని అనుకుంటున్నారు, కాబట్టి భారతదేశం వారు సురక్షితంగా
ఉన్నారు అని తలుస్తున్నారు, ఎక్కడ అయినా శరీరం ఒక్కటే అని మన వారు తెలుసుకోవాలి, సమాజంలో తన స్వీయ-స్థిరమైన
స్థావరాన్ని నిర్మించిన తర్వాత మాత్రమే వైరస్ విస్ఫోటనం చెందుతుంది. వాస్తవానికి ప్రపంచం “నడిచే మరణం” లాగా కనిపిస్తుంది.
ప్రపంచంలోని
అన్ని దేశాలు ఇలా వక్ర మార్గంలో ఉన్నాయి. ఏ వ్యాధి గురించి తీసుకున్న సంక్రమణ
చెందిన విధానం, నిర్దిష్ట
సమయం మరియు సోకినవారికి కనీసం సంఖ్యను బట్టి చైన్ రియాక్షన్ ప్రారంభించబడుతుంది, మరియు ఒకసారి ఈ చైన్ రియాక్షన్ ప్రారంభం అయితే దానిని
ఆపడం చాలా కష్టం. మొదటి వ్యాధి వచ్చిన వ్యక్తి నుండి నుండి వెయ్యవ వ్యాధి సోకినా వ్యక్తి వరకు, మొదటి మరణం నుండి వెయ్యవ మరణం వరకు
సమయం ప్రతి దేశంలో ఒకే విధంగా ఉంటుంది, దీనిలో ఎటువంటి తేడా వుండదు. ఇటలీ మూడు వారాల క్రితం మొదలు
అయింది భారతదేశం, మరియు యుఎస్ఎ పది రోజుల క్రితం మొదలు అయ్యాయి. మనమంతా ఒకే
మార్గంలో ఉన్నాము. సాధారణంగా 200 రోగులకు వ్యాధి నిర్ధారణ జరిగి మరియు పది వ్యాధి కారక మరణాల
తరువాత ప్రతి మూడవ రోజు వ్యాధి సంక్రమణ రెట్టింపు అవుతుంది. నిజమైన వ్యాధి సోకిన వ్యక్తుల
సంఖ్య నిర్ధారణ అయిన కేసుల కన్నా వందల రెట్లు ఎక్కువ. దీనికి కారణం వ్యాధి ప్రభావం
కనిపించని ముసలివారు, వారికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ లక్షణాలు ఉండవు. ప్రజలు వ్యాధి
సోకినా పది రోజుల తర్వాత జ్వరం సంకేతాలను కాపాడతాయి, అయితే మొదటి రోజు నుండే వారు వ్యాధి బారిన పడినవారు.
అంతర్జాతీయంగా
ఇతర దేశాల నుండి వచ్చే వారికి ఎయిర్ పోర్టులలో స్క్రీనింగ్ పరీక్షా అంటే జ్వరం కోసం మాత్రమే పరీక్షలు చేస్తున్నారు ఇది
చాలా పెద్ద తప్పు, చాల మందికి ఆసుపత్రులలో
పరిక్షలు చేసినప్పటికీ రోగలక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కాని వారు కొన్ని రోజులకు
వ్యాధి గ్రస్తులు అని తెలుస్తుంది. రోగ లక్షణాలు ఉన్నవారిని మరియు 30 ఏళ్ల వయస్సు
లోపు ఉన్న వారిని అందరిని పూర్తిగా పరీక్షించిన ఏకైక దేశం దక్షిణ కొరియా, అది వైరస్ కు అనుకూల ప్రదేశం అయినా జ్వరం లేదా ఇతర సంకేతాలు తప్ప
పాజిటివ్ కేసులు మాత్రం లేవు, మరియు దక్షిణ
కొరియాలో మరణాల రేటు దాదాపు సున్నా.
ముప్పై
ఏళ్ల లోపు లేదా నలభై ఏళ్లలోపు వ్యక్తులకు మన ప్రస్తుత అంచనాల కంటే చాలా ఎక్కువమందికి
కరోనా వ్యాప్తి సోకింది. 50 కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మరణాల రేటు ఉన్న వారికి
యువకుల నుండి వ్యాది వ్యాప్తి చెందకుండా చేయడంపై దృష్టి సారించాలి, మనలో మూడింట
రెండు వంతుల మంది ఈ రోజు, వచ్చే నెల లేదా సంవత్సరంలో వ్యాధి
బారిన పడతారు. మనకు దీనికి కావలసిన రోగనిరోధక శక్తి లేదు మరియు ఎవరూ కరోనా నుండి
తప్పించుకోలేరు. ఒక సంవత్సరం వరకు ముందస్తు టీకా పూర్తీ స్థాయిలో అందుబాటులోకి రాదు. వ్యాధి
సోకినవారి జీవితం ప్రతి వంద మందిలో ఇరవై
మంది ఆసుపత్రిలో, పది మంది వరకు ఐసియులో ముగుస్తుంది.
ప్రస్తుతానికి, మన జాతీయ ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఏమంటే ఏ వయస్సులోనైనా రోగలక్షణ
వ్యక్తులను కనుగొనడం మరియు వారిని స్వీయ నిర్బంధంలో ఉంచడంపై దృష్టి సారించాయి.
జ్వరం కోసం ప్రజలను తనిఖీ చేయడం మరియు చేతులు కడుక్కోవడం మరియు సామాజిక దూరం
పాటించడం వంటివి ప్రచారం చేయడం చేస్తున్నాయి.
మనం
డేటాను పరీక్షిస్తే వైరస్ యువ జనాభాలో మొదటి ప్రమాదానికి (ఫస్ట్ స్టేజి) ముందే వ్యాపించింది. జనాభాలో
మరియు బహుళ నగరాల్లో బహుశా ఒక మరణం వెనుక 10000 మందికి పైగా లక్షణం లేని వారు
ఉన్నారు. ప్రతి కేసును మున్సిపల్/మెడికల్ సంస్థలు ట్రాక్ చేస్తున్న ఫైళ్ళను నేను చూశాను, ఈ ట్రాకింగ్ విధానం కొంచెం ఆలస్యం అవుతుందని నేను భయపడుతున్నాను. ఇటలీలో, 65 కంటే ఎక్కువ వయస్సు ఉన్న రోగులు ఇంకుబేట్ అవ్వడం లేదు; సంక్షిప్తంగా చెప్పాలి అంటే వారు చనిపోవడానికి మిగిలిపోతున్నారు అక్కడ వైద్యులు
మరియు పరికరాలు సరిపోనందున చనిపోయే అవకాశం ఉంది. ఇటలీ ప్రపంచంలో రెండవ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ
వ్యవస్థ కలిగిన దేశం; భారతీయ ఆరోగ్య సంరక్షణ 112 వ స్థానంలో ఉంది.
మనం ఏం చేయాలి: మనది అభివృద్ధి చెందుతున్న దేశం మరియు
ప్రత్యేకమైనది. మనకు ధైర్యం మరియు పోరాట స్ఫూర్తికి కొరత లేనప్పటికీ, మన వనరులు మాత్రం పరిమితం. ప్రపంచం దేశాలతో పోలిస్తే మనకు చాలా తక్కువ ఆసుపత్రులు
/ పడకలు ఉన్నాయి మన నగరాలు మరింత రద్దీగా ఉంటాయి మరియు కరోనా వంటి సంక్రమణ వ్యాధి యొక్క
సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికి మన ప్రజలకు చాలా కష్టతరం. వేసవి ఎండలు వైరస్ను ప్రభావితం చేస్తుందో లేదో ఎవరూ
ఖచ్చితంగా చెప్పలేరు ఇది ప్రస్తుతానికి శాస్త్రీయంగా నిరూపించబడలేదు, కేవలం గుడ్డి ఆశ. స్పానిష్ ఫ్లూ మార్చి 1918 లో
వచ్చింది. వేసవిలో విరామం తర్వాత రెండవ సారి మరలా వచ్చి చాలా ఎక్కువ ఘోరం జరిగింది.
మనం
మనదేశంలోని ఒక బిలియన్ ప్రజలు వున్న దేశాన్ని లాక్ చేయడం ఇప్పుడు చేయలేము. ప్రతి
కేసు వచ్చినప్పుడు అది ట్రాక్ చేయలేము. మన దేశంలో ఇప్పటికే తగినంత వైరస్ వ్యాప్తి
చెంది ఉంది. ముసలివారిని యుక్త వయస్సువారి నుండి రక్షించండి, అలాగే ఇతరదేశాలనుండి వచ్చే వ్యక్తుల
నుండి యుక్త వయస్సు వారికీ సంభవించకుండా ఆపండి. యుక్త వయస్సు వారు మన పెద్దలతో సన్నిహిత సంభందం కలిగి ఉండటాన్ని తగ్గించండి. అరవై ఏళ్లు పైబడిన వారు ఏ
సందర్భంలోనైనా 40 కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని కలవకూడదు- అరవై ఏళ్లు
వయస్సు వారికి ఇళ్లలో ప్రత్యేక గదులు మరియు బాత్రూమ్లు ఏర్పాటు చేయండి, వారిని ఒంటరిగా ఉంచడానికి జాతీయ ప్రచారాన్ని నిర్వహించేలా
చేయాలి.
యువత
లేదా వృద్ధులు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామాజిక దూరం ప్రోటోకాల్లు
తప్పనిసరిగ పాటించాలి. పరీక్షలు మరియు పాఠశాలలను పూర్తిగా నిలిపివేయాలి, అత్యవసరం కాని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలి. 25మంది కంటే ఎక్కువ ఉన్న అన్ని
సమావేశాలు నిషేధించబడాలి. ఉద్యోగస్తులకు భత్యంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి అందరికి అనుబంధ భత్యం, వేతన రక్షణ కల్పించాలి. ఆరోగ్య సిబ్బందికి వ్యాధి బారిన పడకుండా తగు చర్యలు
తీసుకోవాలి అవసరం అయితే వారికీ ఇన్సురెన్స్ వంటివి అందించాలి.
జనవరి 24న చైనా 15 నగరాలను
మూసివేసింది కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి వారికి అదే ఏకైక మార్గం. మనము ఇప్పుడు
ఆ మార్గాలపై ఆలోచించడం కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది తుది పరిష్కారం
కాకపోవచ్చు, ప్రజలు ఒకరికి ఒకరు కలువకుండా సామాజిక దూరం 2-3 వారాలు కొనసాగించాలి అలా చేయడం
వలన వైరస్ పెద్ద ఎత్తున నశించిపోతుంది.
కానీ ఎప్పుడు చేయాలి? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న
కరోనా మనలను భూమి మిద లేకుండా చేస్తుందా ? అస్సలు కుదరదు.
ఇది చాలా మంది ప్రియమైనవారి
ప్రాణాలను తీసుకుంటుందా? చాలవరకు.
ఇది దేశ నిర్మాణ ప్రక్రియకు భంగం
కలిగిస్తుందా? ఖచ్చితంగా.
మనము
కరోనా వైరస్ వలన వచ్చే విపత్తు గురించి చాలా తక్కువ బయటపడుతున్నాము. నిజానికి సరిహద్దులు, పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం ధైర్యంగా చర్యలు తీసుకోవాలి అలా ఇప్పటికే మన
ప్రభుత్వం చేసింది. ఇటలీ మరియు ఇరాన్లలో చిక్కుకున్న మన పౌరులను సకాలంలో తిరిగి
తీసుకువచ్చారు కాని అదికూడా ఇప్పుడు సమస్యగా మారింది. ఈ అత్యవసర పరిస్థితుల్లో, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకోవాలి. రాజకీయ పతనాలను
నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ప్రతిచోటా ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా
ఉన్నాయి. మనము జాతీయ నాయకులతో నిలబడి “మీరు తీసుకోవలసిన కఠినమైన
నిర్ణయాలు తీసుకోండి, దేశాన్ని నిశ్చలంగా నిలబెట్టండి, కాని మేము మిలియన్ల మంది ప్రాణాలను కోల్పోకుండా చూసుకోండి. మీరు మీ ఉత్తమ
ప్రయత్నం చేస్తే విఫలమైనందుకు మేము మిమ్మల్ని ఎప్పటికీ తీర్పు చెప్పము. ” అని మనం చెప్పాలి.
సంగ్రహంగా చెప్పాలంటే,
“అంటువ్యాధులు కేసుల కంటే చాలా ఎక్కువగా వున్నాయి , ముసలి వారిని యుక్తవయస్సు వారికి విడిగా వుంచండి, వ్యాధి నుండి మనలని మనం సేవ్
చేసుకోవడానికి మరియు వ్యాప్తిని ఆపడానికి ఒకరినొకరు దూరంగా ఉండండి.”
0 Comments:
Post a Comment